Thursday, May 9, 2024

రైలు పట్టాల ప్రక్కన గుర్తు తెలియని యువతి శవం

కామారెడ్డి – బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని గుర్తించారు. మృతి చెందిన యువతి వయసు 20 సంవత్సరాలు ఉంటాయని కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎస్ఐ తావు నాయక్ తెలిపారు. యువతి కుడి చేతి పైన పచ్చబొట్టుతో నవీన్ కుమార్ అని రాసి ఉన్నట్లు చెప్పారు. ప్రేమ వ్యవహారంతోనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. యువతి వరాలు తెలిసిన వారు ఫోన్ నంబర్ 9440700034, 9703217723 లకు చేయాలని కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావు నాయక్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement