Tuesday, April 30, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

కరీంనగర్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. కోర్టు నుంచి ఆర్ అండ్ బీ గెస్ట్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు సూర్య నర్సింగ్ హోమ్ ఎదుట అదుపుతప్పి పడిపోయారు. తీవ్రగాయాలైన యువకులను అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతులు పౌజాన్ ఖాన్ (17) జాయినుద్దీన్ రజ్వి(17) లుగా గుర్తించారు. చమన్ ప్రాంతానికి చెందిన ఇద్దరు నగరంలో ఓ కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతున్నారు. ఘటన సమాచారం అందగానే ఎంఐఎం నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ కమిటి సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీలు సూర్య నర్సింగ్ హోమ్, సివిల్ హాస్పిటల్, అపొలో రీచ్ హాస్పిటల్ చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారికి కావాల్సిన సహాయక‌ చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement