Friday, May 10, 2024

Cybercrime: ఇద్ద‌రు సైబ‌ర్ నేర‌స్తులు అరెస్ట్ .. 1.4 కోట్లు న‌గ‌దు స్వాధీనం

హైద‌రాబాద్ – సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందుతుల నుంచి 1.4కోట్ల నగదు, లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస రెడ్డి ఈ కేసు వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్ కు చెందిన బాధితురాలు 3 కోట్ల 16 లక్షలు ఈ నేర‌గాళ్ల నష్టపోయిందని చెప్పారు. ఆమె ఇచ్చిన ఆధారాల‌తో నిందితుడిని గోవాలో అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఇద్ద‌రు dafabet అనే వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నార‌ని తెలిపారు.. . ఈ స్కామ్ అంతా దుబాయ్ నుంచి జరిగినట్లుగా నిందితులు ఒప్పుకున్నార‌ని పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ 1.40 కోట్లు న‌గదును స్వాధీనం చేసుకోవ‌డంతో పాటు బ్యాంక్ అకౌంట్ లో రూ. 20 లక్షలు ఫ్రీజ్ చేశామని వెల్లడించారు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చామని తెలిపారు.

ఈ కేసులో నిందితులు ఇతరులకు చెందిన 95 బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నార‌ని గుర్తించామన్నారు. పెట్టుబడులు, ఆన్ లైన్ గేమ్ లతో సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని కమిషనర్‌ అన్నారు. సింగపూర్, హాంకాంగ్ నుంచి నిందితులు ఫోన్లు చేస్తూ.. భారీగా లాభాలంటూ నమ్మించి మోసాలకు దిగుతారన్నారని చెప్పారు. సోషల్ మీడియాలో నిందుతులు కనెక్ట్ అవుతారని పాస్ వర్డ్స్, ఓటీపీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. నిందుతులను పట్టుకున్న పోలీసులను సీపీ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement