Sunday, April 28, 2024

Kidnap: కిడ్నాప్ కలకలం…రెండు కోట్లు డిమాండ్

తెలంగాణలోని హైదరాబాద్ చెందిన ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న ముఠాను నంద్యాల జిల్లా, ఆత్మకూరు అడవి శాఖ అధికారులు చేజ్ చేసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ చెందిన వ్యక్తిని కొంతమంది కిడ్నాప్ చేసి నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలోని నల్లమల్ల అటవీ పరిధిలో తీసుకెళ్తున్నారని సమాచారం వచ్చింది..దీంతో కు ఆత్మకూరు పోలీసులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

ఈ క్రమంలో ఆత్మకూరు (మం) భైర్లుటీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద కిడ్నాపర్లను అటవీ శాఖ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ అయినా వ్యక్తి బంధువుల నుండి కిడ్నాపర్లు రూ.2కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. కిడ్నాపర్ ని అదుపులోకి తీసుకొన్న అటవీ శాఖ,ఆత్మకూరు పోలీసు అధికారులు హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement