Friday, May 3, 2024

TS: అన్నదమ్ములను కాటేసిన గుండెపోటు..

తిమ్మాపూర్, ప్రభ న్యూస్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన ఉమ్మెంతల మధుసూదన్ రెడ్డి (26), ఉమ్మెంతల శ్రీకాంత్ రెడ్డి (30) అనే ఇద్దరు అన్నదమ్ములు రెండు వారాల వ్యవధిలో గుండెపోటుతో మృతిచెందిన తీవ్ర విషాధ సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రేణికుంట గ్రామానికి చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డి చిన్న కుమారుడు ఉమ్మెంతల మధుసూధన్ అలియాస్ మధుకర్ రెడ్డి జీవనోపాధి కోసం హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఈనెల 3న గుండెపోటుకు గురై మరణించగా, పెద్ద కుమారుడు ఉమ్మెంతల శ్రీకాంత్ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి కరీంనగర్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు.

ఇతడు తమ్ముని చిన్న కర్మ రోజు గుండె పోటుకు గురై అర్థరాత్రి చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని నిమ్స్ వైద్యశాలలో మృతిచెందాడు. ఉమ్మెంతల మధుసూదన్ రెడ్డి, ఉమ్మెంతల శ్రీకాంత్ రెడ్డి అనే వీరిరువురు యువకులకు ఇంకా వివాహం కాలేదు. జీవనోపాధి కోసం తమ్ముడు హైదరాబాద్ లో అన్న కరీంనగర్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు. వీరిపై ఆధారపడి కుటుంబంలో వీరి తండ్రి ఉమ్మెంతల చంద్రారెడ్డి, తల్లి అరుణ, తాత భూంరెడ్డి బతుకుతున్నారు. కుటుంబ భారం మోసే ఇద్దరు పిల్లలు రెండు వారాల వ్యవధిలో గుండెపోటు భారిన పడి మరణించడంతో కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement