Sunday, May 5, 2024

TS – ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మోదీ మరోసారి గెలవాలి – ఖుష్బూ సుందర్

హైదరాబాద్ -: నిమిషం కూడా సమయాన్ని వృథా చేయకుండా దేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారన్నారు బీజేపీ నేత, నేషనల్ ఉమెన్ కమిషన్ ఖుష్బూ సుందర్.

ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగేందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీ గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రంలో బీజేపీని గెలిపించాలని ఖుష్బు కోరారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన బైక్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ. కంటోన్మెంట్ సమస్యను తీర్చేది కేంద్రమేనని.. ఇక్కడి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

400 సీట్లతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ విజయఢంకా మోగించడం ఖాయమని ఖుష్బు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హయాంలో డిజిటల్ రంగంలో, విమానయాన, రైల్వే, త్రివిధ దళాలు, జాతీయ రహదారులు, ఇలా అన్ని రంగాల్లో వృద్ధి సాధించామని ఆమె వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement