Tuesday, May 7, 2024

TS – దస్ సాల్, అన్యాయ్ కాల్ – దిగ్విజ‌య్ సింగ్ …

హైద‌రాబాద్ – మోదీ పదేళ్ల పాలనపై దస్ సాల్, అన్యాయ్ కాల్ అనే పేరుతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో డాక్యుమెంట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల మోదీ కాలం కార్పోరేట్లకు కొమ్ముకాసిందని.. మోదీ చెప్పినట్టు ఇది అమృత్ కాల్ కాదు, దేశానికి వినాశ్ కాల్ అని వ్యాఖ్యానించారు. మతం పేరుతో మోదీ సర్కారు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

” పీవీ నరసింహా రావు కాలంలోనే రామాలయం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రామ మందిరం అంశాన్ని రాజకీయం చేయొద్దని మొదటి నుంచి కాంగ్రెస్ ఆలోచించింది. సనాతన ధర్మం ప్రకారం ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాతనే ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. రాముడి జన్మదినం ఏప్రిల్ లో ఉంటుంది. కానీ ఎన్నికల కోడ్ వస్తుందనే ఉద్దేశ్యంతో గుడి నిర్మాణం పూర్తి కాకముందే ప్రణ ప్రతిష్ఠ చేశారు. సతీసమేతంగా కలిసి చేయాల్సిన పూజను మోదీ, మోహన్ భగవత్ ఒక్కొక్కరే కూర్చొని నిర్వహించి సనాతన ధర్మాన్ని కించపరిచారు” అంటూ వివ‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement