Sunday, May 5, 2024

TS : బీఆర్ఎస్‌, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్క‌టే.. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్‌ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి విమర్శించారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ గురించి మాట్లాడే హక్కు అసలు కేసీఆర్‌కు లేనే లేదని మండిపడ్డారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలవదు అంటున్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయం మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తనకు మంచి మిత్రుడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ బలవంతంగా తనపై పోటీకి దించారని వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు మళ్లీ ప్రధాని మోదీకే పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement