Wednesday, April 24, 2024

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీఆర్ ఎస్‌కు అభ్య‌ర్థులే దొర‌క‌రు: త‌రుణ్‌చుగ్‌

తెలంగాణ నుంచి రెండు డ‌జ‌న్ల‌కు పైగా నేత‌లు ట‌చ్‌లో ఉన్నారని, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీఆర్ ఎస్‌కు 60 మంది కూడా అభ్య‌ర్థులు దొర‌క‌రని కామెంట్స్ చేశారు బీజేపీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి త‌రుణ్‌చుగ్‌.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

టీఆర్ఎస్ నుంచి చాలా మంది అసంతృప్త నేతలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు బీజేపీ నేత తరుణ్ చుగ్. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ చేసేదంతా రాజకీయమేనని, రైతుల ధాన్యం తప్పనిసరిగా కేంద్రం కొంటుందని చెప్పారు త‌రుణ్‌చుగ్‌. ఇకపై ప్రజాసమస్యలపై పోరాడి బంగారు తెలంగాణ సాధన ధ్యేయంగా అడుగులేస్తామని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement