Saturday, May 18, 2024

TRS: 33 రకాల వంటకాలు.. ప్లీనరీకి వచ్చే వారికి ఫుల్ దావ‌త్‌

TRS Plenary: ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా 33 ర‌కాల వంట‌కాలతో భోజ‌నం వ‌డ్డించ‌నున్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో ప్రతినిధులకు పసందైన వంట‌కాలు ఆహ్వానిస్తున్నాయి. ప్రతి సందర్భంలోనూ భోజనాలకు, ప్రత్యేకించి సామూహిక భోజనాలకు ఎనలేని ప్రాధాన్య‌మిచ్చే పార్టీ అధినేత‌ కేసీఆర్ మరోసారి టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న‌ వేళ ప్లీనరీలో సైతం రుచికరమైన వంటకాలను రెడీ చేస్తున్నారు.

తెలంగాణ ప్రత్యేకతలను తెలిపే విధంగా, స్వీట్లతో స‌హా 33 రకాల వంటకాలను రెడీ చేశారు. మొత్తం 15 వేల మందికి సరిపడేలా భోజన ఏర్పాట్లు చేశారు. హైటెక్స్‌లోని మూడు హాల్స్‌లో ప్రతినిధులకు భోజనం వడ్డిస్తారు. ఒకేసారి 8వేల మంది అతిథులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇగో.. ఇవే ఆ వంట‌కాలు..
చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటు కోడి పులుపు, ఎగ్ మసాలా, నల్ల పొడి ఫ్రై, మటన్ దాల్చా, బోటి ఫ్రై, పాయా సూప్, తలకాయ పులుసు, రుమాల్ రోటి, ఆలూ క్యాప్సికం, బగారా రైస్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, మిర్చి కా సాలన్, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులసు, ముద్ద ప్పు, సాంబారు, ఉలవచారు, పెరుగు, పెరుగు చట్నీ, జిలేబీ, డబుల్ కా మీఠా, ఐస్‌క్రీం తదితరాలు వడ్డించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement