Monday, May 20, 2024

TS | ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదలీలు.. ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: తెలంగాణలో అధికారుల బదిలీల పరంపర కొనసాగుతోంది. మంగళవారం తాజాగా రాష్ట్రంలో పలువురు ఐఎఫ్‌ఎస్‌ అధికారులను బదిలీ, మరికొందరికి పదోన్నతులు వర్తింపచేస్తూ సీఎం రేవంత్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు.

బి షఫీయుల్లాను పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా నియామకం చేయగా, ప్రియాంక వర్గీస్‌ సీసీఎఫ్‌ (ఐటీ) వింగ్‌కు బదలీ చేశారు. ఆమె గత ప్రభుత్వంలో సీఎం కార్యాలయంలో విధులు నిర్వహించారు. సీఎం ఓస్డీగా బాధ్యతలు నిర్వహించారు. ఎస్టే ఆశా – ములుగు ఫారెస్ట్‌ కాలేజి డీన్‌గా నియమించారు.

ప్రభాకర్‌ను కాళేశ్వరం సర్కిల్‌ సీసీఎఫ్‌గా, మహబూబాబాద్‌ డీఎఫ్‌వోగా ఉన్న రవి కిరణ్‌ను మీ సేవా కమిషనర్‌గా బదలీ చేశారు. వరంగల్‌ డీఎఫ్‌వో ఆపర్ణను డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, హైదరాబాద్‌కు, ఏటూరు నాగారం డీఎఫఖవో అంజు అగర్వాల్‌ను వరంగల్‌ డీఎఫ్‌వోగా నియమించారు. ఆమ్రాబాద్‌ డీఎఫ్‌వో విశాల్‌ బత్తులను డీఎఫ్‌వో మహబూబాబాద్‌కు బదలీ చేశారు.

అదేవిధంగా ఐఎఫ్‌ఎస్‌ శాంతారామ్‌ను కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టుగా పదోన్నతిని వర్తింపజేశారు. ఆయనకు మంచిర్యాల కవాల్‌ టైగర్‌ రిజర్వ్‌ డైరెక్టర్‌గా పోస్టింగ్‌నిచ్చారు. ఎస్‌ రాంబాబును డీసీఎఫ్‌ హైదరాబాద్‌కు, డాక్టర్‌ సునీల్‌ ఎస్‌ హిరేమత్‌ను నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ క్యూరేటర్‌గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement