Sunday, April 28, 2024

TS: వ‌రంగ‌ల్‌లో విషాధం…. నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి..

వ‌రంగ‌ల్‌లో విషాధ ఛాయ‌లు అలుముకున్నాయి. నీటి సంపులో ప‌డి ఇద్ద‌రు చిన్నారులు మృతి చెందారు. ఈఘ‌ట‌న బాలాజీ నగర్ లో తీవ్ర విషాదాన్ని నింపింది.

తాండూరుకు చెందిన కరణం భలేశ్వరి, రవికుమార్‌ దంపతులు మేడారం జాతరను దర్శించుకోవాలనుకున్నారు. వరంగల్‌లోని వారి తల్లిదండ్రులు మరికల రామ, శ్రీనివాస్‌ ఇంటికి వారి పిల్లలు శౌరితేజ(4), తేజస్విని(2)తో సహా గురువారం చేరుకున్నారు. చాలా దూరం ప్రయాణం కావడంతో అలసిపోయిన భలేశ్వరీ, రవికుమార్‌ పడుకున్నారు. శనివారం మధ్యాహ్నం కల్లా మేడారం బయలుదేరాల్సి ఉంది.

ఈలోగా భలేశ్వరీ, రవికుమార్‌ నిద్ర లేచారు. తమ పిల్లలు కనిపించకపోవడంతో ఎక్కడ అని అంతా వెతికారు. చుట్టుపక్కలా వారిని అడిగారు. చివరకు ఇంటి ముందు గల సంపులో చూడగా, విగత జీవులుగా కనిపించడంతో వారి రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రులు పడుకోవడం, ఎవరూ వారిని పట్టించుకోకపోవడంతో ఆడుకుంటూ చిన్నారులిద్దరూ సంపులోపడి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement