Saturday, May 11, 2024

పండుగ పూట విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు మృతి..

మామునూర్, (ప్రభ న్యూస్): వ‌రంగ‌ల్ జిల్లాలో పండుగ పూట విషాదం నెల‌కొంది. సరదాగా ఈత‌కోసం వెళ్లిన ఇద్ద‌రు పిల్ల‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న సోమవారం మధ్యాహ్నం ఉర్సు చెరువు వ‌ద్ద జ‌రిగింది. సరదాగా ఈతకు వచ్చిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు చెరువులోకి దిగి గ‌ల్లంత‌య్యారు. మిల్స్ కాలనీ ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందరాజుల గుట్ట ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉర్సు చెరువులోకి ఈత కోసం వచ్చారు. ఇద్దరు పిల్లలు చెరువులోకి దిగి ఈత కొడుతుండగా లోతు ప్రాంతానికి వెళ్లి గ‌ల్లంత‌య్యారు. గ‌ల్లంతైన వారిలో మాటూరి రాంచరణ్ (12), రిశ్వ‌క్‌గా గుర్తించారు ఇక‌.. వీరితో ఉన్న మ‌రో బాలుడు యశ్వంత్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement