Sunday, May 19, 2024

Breaking: క‌రీంన‌గ‌ర్‌లో ఘోరం.. కారు ఢీకొట్ట‌డంతో ఒక‌రు మృతి

క‌రీంన‌గ‌ర్‌లో ఘోరం జ‌రిగింది. కోతి రాంపూర్ వద్ద గుర్తు తెలియని కారు ఢీకొని ఒక‌రు చ‌నిపోయారు, స్కూటీపై వెళ్తున్న క‌రీంన‌గ‌ర్ సిటీలోని అలుగునూరుకు చెందిన గుర్రాల కృష్ణారెడ్డి (50) అక్కడికక్కడే చ‌నిపోయాడు. కృష్ణారెడ్డి రోజూ కరీంనగర్ వెళ్లి పాల వ్యాపారం చేస్తుంటాడు. యాక్సిడెంట్‌లో అత‌ను చ‌నిపోవ‌డంతో వారి కుటుంబం క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తోంది. అతనికి ఇద్దరు కుమార్తెలున్నారు, ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement