Friday, May 3, 2024

WGL: ట్రాక్టర్ బోల్తా పడి… ఒకరు మృతి

శాయంపేట, ప్రభ న్యూస్: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్ యజమాని (డ్రైవర్) అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం గ్రామంలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే మైలారం గ్రామానికి చెందిన వైద్యుల మధుసూదన్ రెడ్డి (42) అదే గ్రామంలో కోలుకుంట చెరువు ఆయకట్ట రైతులు వరికోస్తూ ఉండడంతో ఆ ధాన్యాన్ని పొలం నుండి కళ్ళం కు తరలిస్తున్నాడు.

ఈ క్రమంలో కట్టపై నుండి వెళ్తున్న మధుసూదన్ పక్కనే ఉన్న పొలంలో ట్రాక్టర్ ఇంజన్ బోల్తా పడింది. దీంతో మధుసూదన్ ట్రాక్టర్ ఇంజన్ కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడే ఉన్న రైతులు ట్రాక్టర్ ను ఎత్తే ప్రయత్నం చేశారు. కానీ ట్రాక్టర్ లేవకపోవడంతో రైతులు జేసీబీని తీసుకొచ్చి ట్రాక్టర్ ఇంజన్ ని తొలగించి మధుసూదన్ డెడ్ బాడీని బయటకు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement