Sunday, May 5, 2024

TS | మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని.. సెల్ టవర్ ఎక్కి యువకుల ఆందోళన

నర్సాపూర్ (ప్రభ న్యూస్): రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం కొల్చారం మండలానికి చెందిన యువకులు సెల్​ టవర్​ ఎక్కి ఆందోళన చేపట్టారు. రవీందర్, శ్రీకాంత్, సురేష్ గౌడ్, అన్వేష్, దిగంబర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి మెదక్ వెళ్లే దారిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ పక్కనున్న సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.

మదన్ రెడ్డికి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చేంతవరకు ఇక్కడి నుంచి దిగేది లేదని రెండు గంటల పాటు హల్ చల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ షేక్ లాల్ మదర్, ఎస్సై శివ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ నుంచి కిందికి దిగాలని యువకులను నచ్చజెప్పి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement