Friday, May 3, 2024

Siddipet: బైకును ఢీకొన్న టిప్పర్.. స్పాట్ లో ఇద్దరు మృతి

బైకును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా మర్కుక్ లో చోటుచేసుకుంది. మర్కుక్ మండలం పాములపర్తి గ్రామ శివారులోని కావేరి సీడ్ కంపెనీకి చెందిన టిప్పర్ బైకును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు స్పాట్ లోనే మృతిచెందారు. మృతులు మర్కుక్ మండలం యూసుఫ్ ఖాన్ పల్లి గ్రామంకు చెందిన వారుగా సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement