Saturday, May 4, 2024

Bellampalli: సాయి ఆలయంలో చోరీ..

బెల్లంపల్లి, జులై 12 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి మండలంలోని బోధ గెస్ట్ హౌస్ సమీపంలోని సాయిబాబా దేవాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో.. తాళ్లగురజాల ఎస్సై నరేష్ సంఘటన స్థలానికి చేరుకొని ఆలయgలో జరిగిన చోరీపై పరిశీలించారు.

అదేవిధంగా డాగ్స్ స్క్వాడ్ తో పరిసరాలన్నీ సోదా చేశారు. దాదాపు రూ.50వేల విలువైన వెండి విగ్రహం, 25 కిలోల పంచలోహ ఉత్సవ విగ్రహం, హుండీ పోయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ విషయమై వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ శంకరయ్య, ఎస్సై నరేష్, టూ టౌన్ ఎస్సై రవికుమార్ లతో కలిసి పరిసరాలను పరిశీలించి ఆలయ కమిటీ, నిర్వాహకులను అడిగి విషయం తెలుసుకున్నారు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement