Friday, May 17, 2024

భ‌ర్త‌ను చంపిన భార్య

భ‌ర్త‌ను భార్య అతి కిరాత‌కంగా న‌రికి చంపిన ఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని విఠలాపూర్ గ్రామం, మండ‌లం చిన్నకోడూరులో మర్కంటి ఎల్లయ్య (65) కు తన భార్యకు కుటుంబ కలహాలతో గత కొన్ని రోజులుగా సంసారం విషయంలో గొడవలు జరుగుతుండేవి. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో మృతుని భార్య నిందితురాలు మర్కంటి నర్సవ్వ, భర్త ఎల్లయ్య ను గొడ్డలితో ఎల్ల‌య్య‌ మెడపై నరకగా బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
సిద్దిపేట రూరల్ సిఐ సురేందర్ రెడ్డి, చిన్నకోడూరు ఎస్సై రాజేష్, సంఘటనా స్థలానికి వెళ్లి హత్య జరగడానికి గల కారణాలు తెలుసుకొని మృతుని కూతురు రేణుక దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలతో భార్య భర్తను గొడ్డలితో నరికి చంపివేసింద‌ని, నిందితురాలు నరసవ్వను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామ‌ని సీఐ సురేందర్ రెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement