Monday, April 29, 2024

TS | పర్యావరణ రక్షణలో పెద్దపులి పాత్ర కీలకం.. ప్రాజెక్ట్‌ టైగర్​తో పెరిగిన సంఖ్య

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రపంచ వ్యాప్తంగా మారిన వాతావరణ పరిస్థితులు… పర్యావరణ రక్షణకు ముప్పుగా మారాయని, ఉన్న అడవుల సంరక్షణ మాత్రమే దీనికి అనువైన పరిష్కారమని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌ అండ్‌ హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) ఆర్‌.ఎం. డోబ్రియల్‌ అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమం హైదరాబాద్‌ (ములుగు) ఫారెస్ట్‌ కాలేజీ, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అడవుల రక్షణకు పులుల ప్రాధాన్యతే కీలకమని, పులులను మనం కాపాడితే, అవి అడవినీ, తద్వారా ప్రజలను కాపాడుతాయని అన్నారు. ఈ విషయం ప్రతీ ఒక్కరూ గ్రహించి, ఇతరులనూ చైతన్యవంతం చేయాలన్నారు. ప్రాజెక్ట్‌ -టైగర్‌ కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలు పులుల సంఖ్య పెరిగేందుకు దోహద పడ్డాయని, ప్రస్తుతం దేశంలో 3,167 పులులు ఉన్నాయని తెలిపారు. అడవికి రాజులా పులి వ్యవహార శైలి, ప్రవర్తన గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతతో అమ్రాబాద్‌, కవ్వాల్‌ -టైగర్‌ రిజర్వుల్లో తీసుకున్న సంరక్షణ చర్యల వల్ల పులుల సంఖ్య బాగా పెరిగిందని, రానున్న రోజుల్లో మరింతగా పులుల ఆవాసాలను అభివృద్ది చేస్తామన్నారు. అటవీ ప్రభావిత గ్రామాల పరిసరాల్లో జంతువులు, మనుషుల మధ్య సంఘర్షణ నివారణకు కృషి చేస్తున్నామన్నారు. పులుల ఆవాసాల్లో అలజడిని తగ్గించేందుకు కోర్‌ ఏరియాల్లో ఉన్న గ్రామాల తరలింపు ప్రక్రియను చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయం మేరకు భవిష్యత్‌ పర్యావరణవేత్తలను తీర్చి దిద్దుతున్న ఫారెస్ట్‌ కాలేజీ, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో రాష్ట్రస్థాయి -టైగర్‌ డే నిర్వహించటం శుభ పరిణామని డీన్‌ ప్రియాంక వర్గీస్‌ అన్నారు. అటవీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ కార్యక్రమం అత్యంత ఉపయోగకరం అని తెలిపారు. రాష్ట్ర స్థాయి అటవీ అధికారులు, ఉద్యోగులు, ఫారెస్ట్‌ కాలేజీ, ఫారెస్ట్‌ అకాడమీ (దూలపల్లి) నుంచి -టె-యినీలు మొత్తం నాలుగు వందల మంది -టైగర్‌ డే ఉత్సవాల్లో పాల్గొన్నారు.

టైగర్‌ థీమ్‌గా నిర్వహించిన వివిధ పోటీ-ల్లో విజేతలైన విద్యార్థులు, ఉద్యోగులకు ఈ సందర్భంగా బహుమతులను అందించారు. అమ్రాబాద్‌, కవ్వాల్‌ -టైగర్‌ రిజర్వుల అభివృద్ది, పురోగతిపై ఫీల్డ్‌ డైరెక్టర్లు వినోద్‌ కూమార్‌, క్షితిజ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. పులుల రక్షణ కోసం అటవీశాఖ తీసుకుంటు-న్న చర్యలపై ఏర్పాటు- చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ ఈమేరకు ఆకట్టు-కుంది. ఫారెస్ట్‌ కాలేజీలో కొత్తగా ప్రారంభిస్తున్న ఎం.ఎస్సీ (వైల్డ్‌ లైఫ్‌) బ్రోచర్‌ను అనంతరం అధికారులు ఆవిష్కరించారు. హైదరాబాద్‌ -టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ- తరపున ఇమ్రాన్‌ సిద్దికీ తాము పులుల సంరక్షణ కోసం చేస్తున్న పనులను సమావేశంలో వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement