Saturday, April 27, 2024

HYD: మూసీ నదిలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం

గాంధీనగర్ నాలాలో గల్లంతైన మహిళ మృతదేహం మూసీనదిలో కొట్టుకొచ్చింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఉదయం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ మహిళను కవాడిగూడ డిఎస్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌ భార్య లక్ష్మి(55)గా గుర్తించారు.

లక్ష్మి ఆచూకీ తెలియటం లేదని ఆదివారం ఆమె కుటుంబ సభ్యులు గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే ఇవాళ ఆమె మృతదేహం కుళ్లిన స్థితిలో మూసీ ఒడ్డున లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం లక్ష్మి మృతదేహన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement