Tuesday, April 30, 2024

ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం

పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 3(ప్రభ న్యూస్): తెలంగాణలో పది పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 7937 మంది విధ్యార్థులకు గాను 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా సమయానికంటే ముందే విధ్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. వారికి కేటాయించిన గదులను హాల్ టికెట్ల వారీగా నోటీస్ బోర్డులపై అంటించగా విద్యార్ధులు గుమి కూడి వేతుకులాడుకున్నారు. పరీక్షల నిర్వహణ సిబ్బంది పరీక్షా కేంద్రాల ద్వారాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. విద్యార్థులతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి కనిపించింది.


- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement