Monday, April 29, 2024

నేటి మధ్యాహ్నం 12 గంటలకు టెన్త్‌ ఫలితాలు

తెలంగాణ టెన్త్‌ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు..

ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 4,84,370 మంది హాజరయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో తొమ్మిది మంది పాత విద్యార్థులకు సంబంధించి తెలుగు పరీక్ష జవాబుపత్రాల బండిల్‌ కనిపించకుండా పోయిన నేపథ్యంలో వారిని అంతర్గత మార్కులు ఆధారంగా పాస్‌ చేసినట్లు తెలిసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement