Friday, May 3, 2024

మహేశ్వరంలో ఉద్రిక్తత

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఇవాళ ఉద‌యం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లోని బీజేపీ కార్పొరేటర్ నరేంద్ర కుమార్‌‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కార్పొరేటర్‌ ఇంటిని ముట్టడించారు. ఈసంద‌ర్భంగా టీఆర్ఎస్ లో చేరిన కార్పొరేట‌ర్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement