Sunday, April 28, 2024

Ts : ప్రయాణికులకు షాక్… తెలంగాణాలో బస్సులు బంద్..

తెలంగాణ ప్రయాణికులకు బిగ్ షాక్ తగలనుంది. రేపటి నుంచి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు  సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, రద్దీ పెరిగితే బస్సులు పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వారిని ఇవాళ చర్చలకు ఆహ్వానించింది. చర్చలు సానుకూలంగా లేకపోతే సమ్మె యధావిధిగా చేస్తామని యజమానులు హెచ్చరించారు. మరి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెపై ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement