Tuesday, April 30, 2024

Telangana – పలువురు ఐపిఎస్ లు బదిలీలు…. కొత్త పోస్టింగ్ లు

హైద‌రాబాద్ – రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్, నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న డీఐజీ వి. రంగనాథ్ ను హైదరాబాద్ టీఎస్ పిఏ జాయింట్ డైరెక్టర్ గా, వెయిటింగ్ లో ఉన్న ఎస్. రాజేంద్రప్రసాద్ ను హైదరాబాద్ టీఎస్పీఏ డిప్యూటీ డైరెక్టర్ గా, వెయిటింగ్ లో ఉన్న బి. శ్రీనివాస్ రెడ్డిని సిఐడి ఎస్పీగా, వెయిటింగ్ లో ఉన్న ఎన్. వెంకటేశ్వర్లు ను గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా, సైబరాబాద్ వుమెన్ సేఫ్టీ విభాగంలో డీసీపీగా పని చేస్తున్న నికిత పంత్ ను హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ జోన్ డిసిపిగా, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా పనిచేస్తున్న రోహిత్ రాజ్ ను సౌత్ ఈస్ట్ డిసిపి గా, వెయిటింగ్ లో ఉన్న ఆర్. వెంకటేశ్వర్లు ను హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపి గా, పిసిఎస్ అండ్ ఎస్ హైదరాబాదులో పనిచేస్తున్న వి. సునీత మోహన్ ను పెద్దపల్లి డిసిపి గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


బ‌దిలీ అయిన అధికారులు వివ‌రాలు….
TSPSA జాయింట్ డైరెక్టర్ గా రంగనాధ్..
TSPSA డిప్యూటి డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్…
సీఐడీ ఎస్పీ గా శ్రీనివాస్ రెడ్డి…
గ్రే హౌoడ్స్ ఎస్పీ గా వెంకటేశ్వర్లు…
సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ గా నితికా పంత్…
సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గా రోహిత్ రాజ్…
ట్రాఫిక్ డీసీపీ గా ఆర్ వెంకటేశ్వర్లు..
పెద్దపల్లి డీసీపీ గా సునీతా మోహన్..

Advertisement

తాజా వార్తలు

Advertisement