Tuesday, May 21, 2024

NZB: సుబ్రమణ్య స్వామి ఆలయంలో బాజిరెడ్డి ప్రత్యేక పూజలు

నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 20 (ప్రభ న్యూస్) : బోర్గం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో సతీసమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, ధర్పల్లి జడ్పిటీసి బాజీరెడ్డి జగన్మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం బోర్గం గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు దుర్గాదేవి మండపాల్లో సతీసమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరిపై దుర్గాదేవి దివ్య ఆశీస్సులు ఉండాలని ఆయన దుర్గామాతను కోరారు. ఆయన వెంట నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఈగ సంజీవరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు శ్రీను మధుకర్ రావు, బోర్గం గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement