Sunday, April 28, 2024

Harish Rao: ఢిల్లీ నుంచి ఎంత మంది వచ్చినా…. కేసీఆర్ వెంటే తెలంగాణ ప్ర‌జ‌లు.. మంత్రి హ‌రీష్‌రావు

ఢిల్లీ నుంచి ఎంత మంది వచ్చినా తెలంగాణ ప్ర‌జ‌లు సీఎం కేసీఆర్ వెంటే ఉంటార‌ని మంత్రి హ‌రీష్‌రావు పేర్కొన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంగా ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉంటేనే సురక్షితంగా ఉంటుందని చెప్పారు.

ఉద్యమంలో కనపడని వారు కూడా ఓట్ల కోసం బయల్దేరారని… అలాంటి దొంగలకు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్ దే అని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పారు. రేపు పోలింగ్ లో కేసీఆర్ పై తెలంగాణ ఏకపక్షంగా తన అభిమానాన్ని చాటబోతోందని తెలిపారు. ప్రచారంలో కష్టపడ్డ ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ఈ విష‌యాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement