Tuesday, May 21, 2024

తెలంగాణ బోనాలకు ఘన చరిత్ర.. మహంకాళిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై..

సికింద్రాబాద్, (ప్రభ నూస్) : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. సోమవారం రాత్రి అమ్మవారి ఆలయానికి గవర్నర్​ రావడంతో ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, అర్చకులు, వేదపండితులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. ఉజ్జయినీ మహంకాళి దయతో ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని, ఆమె దీవెనలు తెలంగాణ ప్రజలకు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. తెలుగు ప్రజలు అన్నా, తెలుగు భాష అన్నా తనకు ఎంతో మక్కువ అని అందుకే తెలుగులో మాట్లాడుతున్నానని చెప్పారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement