Friday, May 3, 2024

ప్ర‌జా పంపిణీపై ప‌క్కా నిఘా : స‌బితా ఇంద్రారెడ్డి

ప్ర‌జా పంపిణీపై ప‌క్కా నిఘా పెట్టామ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం మంత్రి తన ఛాంబర్ లో తుక్కుగూడ మున్సిపాలిటీ టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎలగొండ పద్మ భాస్కర్ రెడ్డికి పౌర సరఫరాల జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యురాలుగా నియామక పత్రం అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు అందజేస్తున్న సరుకులు పక్కదారి పట్టకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. సరుకుల అందజేతలో అత్యంత పారదర్శకత రానుందన్నారు. పౌర సరఫరాల పనితీరుపై ప్రతినెలా సమావేశాలు జ‌రుగుతాయ‌న్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు సర్కారు నడుం బిగించిందన్నారు. పంపిణీ వ్యవస్థపై డేగకన్ను వేసేందుకు రంగారెడ్డి జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ ఏర్పాటు జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement