Thursday, April 18, 2024

కోవిడ్ ఆస్పత్రిలో ఆగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

మహరాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అహ్మద్‌నగర్ లోని కోవిడ్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు రోగులు సజీవదహనమయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా వార్డులోని ఐసీయూలో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి ఐసీయూలో 17 మంది రోగులు చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఐసీయూలో షార్ట్ సర్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement