Sunday, April 28, 2024

TS: బీఆర్ఎస్‌కు సునీత మహేందర్ రెడ్డి రాజీనామా..

బీఆర్ఎస్‌కు వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపించారు. కాగా, కాసేపట్లో ఆమె హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు రానున్నారు.

ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆమె భర్త మహేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరితో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు, తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితా రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement