Sunday, April 28, 2024

TS : భానుడి ఎఫెక్ట్‌… తగ్గనున్న బస్సుల ఫ్రీక్వెన్సీ

భానుడి ప్ర‌తాపం ఆర్టీసీ పై ప‌డింది. దంచికొడుతున్నఎండలతో ఆర్టీసీ కీల‌క నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సులను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

- Advertisement -

ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం తర్వాత గ్రేటర్​పరిధిలో నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేసేవారి సంఖ్య తగ్గింది. జనం అత్యవసరమైతే తప్ప పెద్దగా బయటికి రావడం లేదు. ఈ నేప‌థ్యంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సుల సంఖ్యను తగ్గించనుంది.

మధ్యాహ్నం వేళ ప్రయాణికులు లేక పోవడంతో సర్వీసులను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎండల తీవ్రత తగ్గే వరకు కొనసాగుతుందన్నారు.ఈ నెల 17 నుంచి మధ్యాహ్నం వేళ సిటీ బస్సుల సంఖ్య తగ్గిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement