Sunday, April 28, 2024

ADB: ఉద్యమ నాయకుని పాడే మోసిన విప్ బాల్క సుమన్

చెన్నూర్, ప్రభ న్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపెల్లి మండలం లింగన్న పేట గ్రామానికి చెందిన ఉద్యమ నాయకుడు ఎరినాగుల మల్లిఖార్జున్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

బుధవారం లింగన్నపేట గ్రామంలో జరిగిన ఆయన అంతిమయాత్రలో విప్ బాల్క సుమన్ పాల్గొని పాడేమోసారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశలో మృతుడు మల్లిఖార్జున్ చురుకుగా పాల్గొని విప్ మన్ననలను పొందారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో విప్ బాల్క సుమన్ గెలుపునకు తనవంతు కృషి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement