Friday, July 26, 2024

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే శుభోదయం.. కాలే యాద‌య్య‌

శంకరపల్లి (ప్రభ న్యూస్) : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే శుభోదయం కార్యక్రమం అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని గాజులగూడా లక్ష్మారెడ్డి గూడా గ్రామాల్లో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పనితనాన్ని ప్రజలకు చేరే క్రమంలో కలుగుతున్న ఇబ్బందులను తెలుసుకొని అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేందుకు ఆయన చేస్తున్న కృషికి సర్వత్రా అభినందనలు వెల్లువిరుస్తున్నాయి. ఆసరా పెన్షన్లు లభిస్తున్నాయా, 24 గంటలు విద్యుత్ అందుబాటులో ఉందా, కంటి సమస్యలను కంటి వెలుగు ద్వారా పరిష్కరించుకున్నారా అంటూ ఆయన గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి అడుగుతున్న పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement