Tuesday, April 16, 2024

Rangareddy: భవనం పై నుండి దూకి మహిళ ఆత్మహత్య

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) : భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంకర్పల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. స్థానికంగా అందుతున్న వివరాలిలా ఉన్నాయి.. రెడ్డి కాలనీలో జనార్దన్ రెడ్డి, లలిత దంపతులు కొన్ని రోజుల నుండి ఒక ఇంట్లో అద్దెకు నివాసముంటున్నారు. తెల్లవారుజామున దాదాపు నాలుగు గంటల సమయంలో లలిత (34) ఐదు అంతస్తుల భవనంపై నుండి దూకగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గంట క్రితం ఆమె చనిపోయిందని తెలిపారు. ఈ ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement