Wednesday, May 1, 2024

క‌న్నులపండుగా శ్రీ‌రామ‌న‌వ‌మి.. వైభవంగా సీతారాముల‌ శోభాయాత్ర

శ్రీరామ నవమిని పురస్కరించుకుని పెద్ద‌ప‌ల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన శోభాయాత్ర వైభవంగా జరిగింది. ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని కంచర భావి నుండి జెండా చౌరస్తా, మజీద్, అమర్ నగర్ మీదుగా అయ్యప్ప దేవాలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ మాల ధారులతో పాటు పెద్ద సంఖ్యలో యువత కాషాయ జెండాలు చేతబూని జైశ్రీరామ్ నినాదాలు చేశారు. కార్యక్రమంలో దుగ్యాల ప్రదీప్ కుమార్, గొట్టేముక్కుల సురేష్ రెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలో మాలధారులు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement