Wednesday, May 1, 2024

Breaking: ఈత‌కు వెళ్లి సోష‌ల్ వెల్ఫేర్ స్టూడెంట్ మృతి.. జ‌న‌గామ జిల్లాలో ఘ‌ట‌న‌

మండుతున్న ఎండ‌ల‌తో చాలామంది ఈత కొట్టి సేద తీరేందుకు ట్రై చేస్తుంటారు. అట్లానే జనగామ జిల్లాలో ఇవ్వాలో విద్యార్థి బావిలో ఈత‌కు వెళ్లాడు. కానీ, అక‌స్మాత్తుగా బావిలోని నీటిలో మునిగి చ‌నిపోయిన ఘ‌ట‌న ఇవ్వాల జ‌రిగింది.

జనగామ మండలం యశ్వంతపూర్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఓడల బావిలో ఈతకు వెళ్లి సోషల్ వెల్ఫేర్ స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి చ‌నిపోయాడు. మృతుడు మద్దూరు రంజిత్‌గా గుర్తించారు. ఇత‌ని సొంతూరు రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం అని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement