Tuesday, July 23, 2024

TS | జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ నుంచి పొగలు..

తిప్పర్తి: విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బ్రేకులు పట్టేయడంతో నల్గొండ జిల్లా తిప్పర్తి రైల్వేస్టేషన్లో అధికారులు నిలిపివేశారు. రైలు ఎందుకు ఆగిందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే మరమ్మతులు చేయడంతో రైలు బయలుదేరింది. బ్రేకులు పట్టేయడంతో రాపిడికి వీల్స్‌ నుంచి పొగ వచ్చిందని తిప్పర్తి రైల్వే స్టేషన్‌ మాస్టర్ రాయుడు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement