Friday, May 3, 2024

అంగన్‌వాడీ సిబ్బందికి స్మార్ట్‌ ఫోన్లు

కామారెడ్డి, (ప్రభన్యూస్‌) : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇటీవల జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలకు, సూపర్‌ వైజర్లకు సరఫరా చేసిన స్మార్ట్‌ ఫోన్లను జిల్లా కలెక్టరు జితేష్‌ వి పాటిల్‌ కామారెడ్డి ప్రాజెక్ట అంగన్వాడీ టీచర్లకు ఈరోజు అందజేసారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అంగన్‌వా డీ టీచర్లు, సూపర్‌ వైజర్లకు శాఖ ద్వారా స్మార్ట్‌ ఫోన్లు అందించడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, సీడీపీఓ శ్రీలత, సూపర్‌ వైజర్‌ అమృత, జూని యర్‌ అసిస్టెంట్‌ సాగర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement