Saturday, April 20, 2024

Self Deffence | ఇందల్వాయి టోల్‌గేట్‌ వద్ద కాల్పులు కలకలం ..

దర్పల్లి: నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి టోల్‌గేట్‌ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీస్ వాహనంపై దొంగలు దూసుకురావడంతో ఆత్మరక్షణ కోసం ఎస్సై గాల్లో కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళితే.. ముప్కాల్ మండలంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాపర్‌ కాయిల్‌ చోరీ చేసిన అంతర్‌రాష్ట్ర ముఠా 44వ జాతీయ రహదారి మీదుగా వెళ్తోందని పోలీసులకు ఆదివారం అర్ధరాత్రి సమాచారం వచ్చింది. దీంతో ఇందల్వాయి ఎస్సై నరేశ్, దర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి ఇందల్వాయి టోల్‌గేటు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో దొంగల ముఠా అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో తమ కారుతో దర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం ఎస్సైను సైతం ఢీకొట్టేందుకు రావడంతో ఆత్మరక్షణ కోసం ఆయన రెండు సార్లు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో దుండగులు పక్కవైపు నుంచి పారిపోయినట్లు ఇందల్వాయి ఎస్సై నరేశ్‌ తెలిపారు. అంతర్‌రాష్ట్ర ముఠాపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement