Saturday, April 20, 2024

కాపుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి… కొడాలి నానికి అంజిబాబు డిమాండ్

కాపుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు కాపుల‌కు క్ష‌మాప‌ణి చెప్పాల‌ని ప్రజా కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు డిమాండ్ చేశారు. అంజిబాబు మాట్లాడుతూ… కొడాలి నాని కాపు కులం పేరు ఎత్తి తిట్టారని, దీనిపై కాపు కులస్తులందరికీ 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, చెప్పకపోతే తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి ఉంటుందని కొడాలి నానిని హెచ్చ‌రించారు.

త‌మ కాపులందరూ అన్ని పార్టీల్లో ఉన్నారని, మీరు ఆచితూచి మాట్లాడితే మంచిదన్నారు. ఎవరినైతే విమర్శించాలో వారి గురించి మాట్లాడండి.. త‌మ కాపు కులస్తుల జోలికి వస్తే ఖబర్దార్.. నోరు అదుపులో పెట్టుకో.. కాపు కులస్తుల్ని తిట్టే అధికారం నీకు ఎవరిచ్చారని ప్ర‌శ్నించారు. తామూ నోటికి వచ్చినట్టు తిట్టగలం.. కానీ త‌మకు సంస్కారం ఉందన్నారు. నీవు గుడివాడలో గెలవడానికి త‌మ కాపు కులస్తులే పెద్దపీఠ వేశారని గుర్తుంచుకోవాల‌న్నారు. వెంటనే కాపుల‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement