Saturday, May 4, 2024

TS: గుర్తుతెలియని వాహనం ఢీకొని గొర్రెల కాపరి మృతి..

శంకరపట్నం: శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్ల పల్లె గ్రామాల మధ్య జాతీయ రహదారిపై శనివారం ఓ గుర్తు తెలియని వాహనం గొర్రెల కాపరిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తగట్టు గ్రామానికి చెందిన మల్యాల శ్రీనివాస్ గొల్లపల్లి గ్రామంలో ఉడికే తిరుపతి అనే గొర్రెల పెంపకం దారునికి గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడని పనిలో భాగంగా శ్రీనివాసు శనివారం ఉదయం కొత్తగట్టు ఇంట్లో నుండి భోజనం చేసి గొల్లపల్లెకు బయలుదేరగా కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాల మధ్యగల బ్రిడ్జిపైన ఓ గుర్తు తెలియని వాహనg ఢీకొట్టడంతో శ్రీనివాస్ సైకిల్ నుజ్జు నుజ్జయి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం తెలుసుకున్న కేశవపట్నం ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి శ్రీనివాస్ కు భార్య, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కుటుంబ సభ్యుల రోధనలు ఆకాశాన్నంటాయి. దీంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అనుముకున్నాయి. ఎస్సై వెంట ఏఎస్ఐ మల్లారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ లతీఫ్, రాంబాబు, రమేష్, హోంగార్డులు రవి, సదయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement