Saturday, April 20, 2024

బొగ్గు గ‌నుల‌ను తాకట్టు పెట్టారు: కేసీఆర్ పై షర్మిల ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఫైరయ్యారు. ఇప్పటికే రైతు సమస్యలు, ధాన్యం కొనుగోలు, నిరుద్యోగం, యువత ఆత్మహత్యలపై విమర్శలు గుప్పించిన షర్మిల.. తాజాగా సింగరేణి కార్మికుల సమస్యలుపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

‘’ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను కార్పొరేట్ శ‌క్తుల‌కు ధారాద‌త్తం చేసే MMDR చ‌ట్టాన్ని కేంద్రం తీసుకొస్తే, KCR ప్ర‌భుత్వం దానిని వ్య‌తిరేకించ‌లేదు. ఢిల్లీలో దోస్తీ.. గ‌ల్లీలో కుస్తీ కోసం తెలంగాణ బొగ్గు గ‌నుల‌ను తాకట్టు పెట్టారు. సింగ‌రేణి స‌మ్మెకు మా మ‌ద్ద‌తు ఉంటుంది. కేంద్రానికి లేఖ రాశాన‌ని చెబుతున్న KCR.. ఆ లేఖ‌ను బ‌హిర్గతం చేయాలి. KCRకు చిత్త‌శుద్ధే ఉంటే ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన TRS ఎంపీలు పార్ల‌మెంట్‌లో పోరాడాలి. లేదంటే రాజీనామా చేసి, కేంద్రంపై ఒత్తిడి తేవాలి’’ అని షర్మిల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement