Monday, April 29, 2024

Shabbir Ali – న్యాయవాదుల సంక్షేమానికి ‌కృషి చేస్తా

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్) 28: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే న్యాయవాదుల సంక్షేమానికి ‌ ప్రత్యేక చర్యలు చేపడతామనీ నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

మంగళవారం నిజామాబాద్ పట్టణంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్ లో పట్టణ న్యాయవాదులతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహ మ్మద్ అలీ షబ్బీర్ సమావేశమై వారి మద్దతు కోరారు…ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, న్యాయవాదుల సంక్షేమానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ‌ అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయ వాదులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు..

ఈ ఎన్నికల్లో న్యాయవాదులు నాకు మద్దతు ప్రకటించడం హర్షనీయమని అన్నారు. న్యాయవాద వ్యవస్ధను అన్ని విధాలుగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే కృషి చేస్తోందన్నారు. న్యాయ వాదుల్లోని పేదలకు ఇల్లు ఇప్పించడంతోపాటు ఇంద్రమ్మ ఇల్లు పథకం కింద ఇండ్లు ఇప్పించి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తాం, ఎవరైనా న్యాయవాదులు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వారిని ఆదు కునే ప్రయత్నం చేస్తాం, జూనియర్ న్యాయవాదుల సంక్షేమానికి పాటుపడుతాం గెలిచిన తర్వాత మీ సమస్యల తోపాటు మీ సలహాలు సూచనలు తీసుకుని పట్టణాన్ని అభివృద్ధి చేస్తాననీ అన్నారు. తనకు మద్దతు తెలిపిన మీ అందరికీ ధన్యవాదాలుతెలుపూ మీతో పాటు మీ మిత్రులు మీ కుటుంబ సభ్యులు బందువులు అందరితో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement