Thursday, April 25, 2024

కరోనాతో గాంధీభవన్ అటెండర్ మృతి

హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో అటెండర్ గా పనిచేస్తున్న షబ్బీర్ కరోనాతో మృతి చెందాడు.  ఇటీవల కరోనా బారిన పడిన షబ్బీర్… గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గత ఐదు రోజులుగా టిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అయితే, బుధవారం పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.

షబ్బీర్ గత మూడు దశాబ్దాలుగా గాంధీ భవన్ లో అటెండర్ గా సేవలు అందిస్తున్నాడు. గాంధీ భవన్ కు వచ్చే వచ్చే కార్యకర్తలకు, నేతలకు అందరికీ బాగా తెలిసిన వ్యక్తి షబ్బీర్ గుర్తింపు పొందారు. షబ్బీర్ అకాల మరణం పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు షబ్బీర్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement