Monday, May 6, 2024

NZB: వాహనాల తనిఖీల్లో రూ.50లక్షలు సీజ్ : అసిస్టెంట్ కమిషనర్

ఇందల్ వాయి, అక్టోబరు 12, ప్రభ న్యూస్ : వాహ‌నాల త‌నిఖీల్లో రూ.50ల‌క్ష‌లు సీజ్ చేసిన‌ట్లు నిజామాబాద్ అసిస్టెంటు కమీషణర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున బుధ‌వారం రాత్రి నిజామాబాద్ అసిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆద్వర్యంలో ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ఎస్సై మహేష్ సి.ఐ కృష్ణ వారి సిబ్బంది వాహనాలు తనిఖీలు నిర్వహించారు.

ఇందల్వాయి వద్ద అనుమానాస్పదంగా ఎటువంటి ఆధారాలు లేకుండా 50 లక్షల రూపాయలు అక్రమంగా తరలిస్తున్న డబ్బులను స్వాధీన పర్చుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యల నిమిత్తం ఇన్ కమ్ టాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి సిఐ కృష్ణ, ఇందల్ వాయి ఎస్ఐ మహేష్, తదితులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement