Sunday, April 28, 2024

Sangareddy : జిన్నారంలో 14 కిలోల అల్ప్రాజోలం పట్టివేత

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో డ్రగ్‌ మాఫియా గుట్టురట్టయింది. జిల్లాలోని జిన్నారంలో యాంటీ నార్కోటిక్‌ పోలీసులు-సంగారెడ్డి జిల్లా పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిన్నారంలోని ఓ పాడుబడ్డ పరిశ్రమల్లో డగ్స్‌ తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. వారివద్ద 14 కిలోల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడ్డ అల్ప్రాజోలం విలువ సుమారు రూ.3 కోట్లకుపైగా ఉంటుందని చెప్పారు. ముఠాలో నలుగురిని అరెస్టు చేశామని, డ్రగ్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం విచారణలో తేలుతుందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement