Wednesday, May 15, 2024

Lazy – ఉచితం పేరుతో ప్ర‌జ‌లను సోమ‌రులుగా చేస్తున్న ప్ర‌భుత్వాలు …త్రిదండి చిన జీయ‌ర్ ఘాటు విమ‌ర్శ

బావుల‌పాడు … సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు పలు ఉచితాలు ఇస్తూ ప్ర‌జ‌ల‌ను సోమ‌రులుగా ప్ర‌భుత్వాలు మారుస్తున్నాయంటూ చినజీయర్ స్వామి విమ‌ర్శించారు… సంక్షేమ పేరుతో పలు రాయితీలను ఇస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. కృష్ణా జిల్లా బావులపాడు మండలం వీరపల్లిలో విజయా డెయిరీ కొత్త యూనిట్ ను చిన్న జీయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూర్చుంటే ఒకటి, నడిస్తే ఒకటి, పుడితే ఒకటి, నడిస్తే ఒకటి, తింటే ఒకటి, తినకపోతే ఒకటి, పడుకుంటే మరొకటి ఇలా ప్రతి దానికి రాయితీలు, ఉచితాలు ఇస్తూ ప్రజలను బలహీనులుగా, బద్ధకస్తులుగా చేస్తున్నారని అన్నారు. అన్నీ మనింటికే చేరుతుంటే ఇక పని చేయడం ఎందుకులే అనే ధోరణిలో ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement