Wednesday, May 1, 2024

Crime: దోపిడి దొంగ‌ల దాడిలో సెక్యూరిటీ గార్డు మృతి..

రాజేంద్ర‌న‌గ‌ర్ – మైల‌దేవ‌ర‌ప‌ల్లిలో దొంగలు ఓ కంపెనీలో దోపిడీకి యత్నించగా సెక్యూరిటీ గార్డు అడ్డుపడ్డాడు. అతనిపై తీవ్రంగా దాడి చేయడంతో మృతి చెందాడు. ఆరంఘర్ చౌరస్తాలో ఉన్న హ్యామర్ రిపేరింగ్ కంపెనీలో కొందరు దొంగలు చోరీకి వచ్చారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న యూపీకి చెందిన సెక్యూరిటీ గార్డు ఆసిఫ్(25)పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

యజమాని కొడుకు కంపెనీకి రాగా సెక్యూరిటీ గార్డ్ గేటు తీయలేదు. దీంతో అతడు తండ్రి మహబూబ్ ఖాన్‌కు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. కంపెనీకి కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ హత్యకు గురి కావడంతో యజమాని మహబూబ్ ఖాన్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు. ఇన్స్ పెక్టర్ మధు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ను రప్పించి వివరాలు సేకరించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement